Kiran Pahal | పంచకుల(హర్యానా): ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు భారత యువ అథ్లెట్ కిరణ్ పహల్ అర్హత సాధించింది. జాతీయ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భాగంగా గురువారం జరిగిన మహిళల 400మీటర్ల రేసును 50.92 సెకన్లలోముగించడం ద్వారా విశ్వక్రీడల బెర్తు దక్కించుకుంది. ఇదే పోటీలో పాల్గొన్న దేవిఅనిబ (53.44సె), స్నేహ (53.51సె) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. 400మీటర్ల విభాగంలో అర్హత మార్క్ను 50.95సెకన్లుగా నిర్ణయించగా, కిరణ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.