కోల్కతా: ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నీగా గుర్తింపుపొందిన డ్యూరాండ్ కప్ ఈనెల 27 నుంచి మొదలవనుంది. 133వ ఎడిషన్గా జరుగనున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీని జులై 27 నుంచి ఆగస్టు 31 దాకా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
24 జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో ఇండియన్ సూపర్ లీగ్, ఐ-లీగ్ జట్లతో పాటు పలు అంతర్జాతీయ జట్లూ పోటీపడే అవకాశముంది.
ఈసారి కోల్కతా, కోక్రఝర్ (అస్సోం)తో పాటు కొత్తగా జంషెడ్పూర్, షిల్లాంగ్ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తున్నాయి. 24 జట్లు ఆరు గ్రూపులుగా విడిపోయి తలపడబోయే ఈ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది.