Wrestling Championship | అమ్మన్ (జోర్డాన్): భారత యువ రెజ్లర్లు అదితి కుమారి, నేహా సంగ్వాన్, పుల్కిత్ స్వర్ణ పతకాలతో మెరిశారు. జోర్డాన్లో జరుగుతున్న అండర్-17 వరల్డ్ చాంపియన్షిప్స్లో భాగంగా గురువారం జరిగిన మహిళల 43 కిలోల ఫైనల్లో అదితి పసిడి నెగ్గింది.
57 కిలోల ఫైనల్లో నేహా 10-0తో జపాన్ రెజ్లర్ సొ సుట్సుయ్ను ఓడించి స్వర్ణం గెలిచింది. నేహాది ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వగ్రామం (హర్యానాలోని బలాలీ) కావడం గమనార్హం. 65 కిలోల విభాగంలో పుల్కిత్ సైతం స్వర్ణం సాధించింది. ఇదే టోర్నీ గ్రీకో రోమన్ ఈవెంట్లో భారత్కు రెండు కాంస్యాలు దక్కాయి.