Vishnu Sarvanan: గతేడాది హాంగ్జౌ వేదికగా ముగిసిన ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించిన భారత సెయిలర్ విష్ణు శరవణన్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. సెయిలింగ్ క్రీడలో భారత్ నుంచి అర్హత సాధించిన తొలి సెయిలర్ విష్ణునే కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఐఎల్సీఎ-7 వరల్డ్ ఛాంపియన్షిప్లో రాణించిన అతడు పారిస్ బెర్తును దక్కించుకున్నాడు. ఈ ఈవెంట్లో ఆసియా దేశాల నుంచి ఏడు బెర్తులు ఉండగా.. ఆసియా గేమ్స్తో పాటు ఇటీవల కాలంలో మెరుగ్గా రాణిస్తూ ర్యాంకుల పంట పండిస్తున్న హాంకాంగ్, థాయ్లాండ్, సింగపూర్ సెయిలర్లను శరవణన్ వెనక్కినెట్టడం విశేషం.
ఆర్మీలో ప్రస్తుతం సుబేదార్గా పనిచేస్తున్న 24 ఏండ్ల విష్ణు.. ఓవరాల్గా ఈ ఈవెంట్లో 174 స్కోరు చేశాడు. మొత్తంగా 152 మంది పాల్గొంటున్న ఈ ఈవెంట్లో విష్ణు 26వ స్థానంలో ఉన్నాడు. ఆసియా దేశాల తరఫున విష్ణు అగ్రస్థానంలో నిలిచాడు. విష్ణు 2019లో అండర్ – 21 వరల్డ్ ఛాంపియన్షిప్లో కాంస్యం పొందాడు.
Riding the waves to #Paris2024 ✌️ ⛵
🇮🇳’s Vishnu Saravanan has secured India’s 1⃣st #ParisOlympics quota in Sailing at the ILCA 7 World Championship, held in Adelaide, 🇦🇺
Clinching one of the 7⃣ Olympic quotas available at the event, #TOPScheme Athlete Vishnu outsailed many… pic.twitter.com/v2RAczziZ6
— SAI Media (@Media_SAI) January 31, 2024