ఢిల్లీ: వచ్చే నెల పారిస్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స్ కోసం భారత హాకీ జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. సీనియర్లు, కొత్త కుర్రాళ్ల కలయికతో కూడిన 16 మంది సభ్యులకు హర్మన్ప్రీత్ సింగ్ సారథిగా వ్యవహరించనున్నాడు. వెటరన్ గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్, మిడ్ ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ వంటి అనుభవజ్ఞులతో పాటు జర్మన్ప్రీత్, సంజయ్, రాజ్కుమార్, అభిషేక్ వంటి కుర్రాళ్లూ జట్టులో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్లో కాం నెగ్గిన భారత్.. పారిస్లో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్తో పూల్ ‘బి’లో ఉంది. జూలై 27న భారత్.. న్యూజిలాండ్తో మ్యాచ్తో పతక వేటను ఆరంభించనుంది.