చెన్నై: మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా జట్టు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మహిళ క్రికెట్లో ఇండియా అత్యధిక స్కోరును నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో చెన్నైలో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్ను ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 603 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి రోజు తొలి ఇన్నింగ్స్లో 525 రన్స్ చేసిన ఇండియా, రెండవ రోజున మరో 78 రన్స్ జోడించి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో టెస్టు చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరు చేసిన జట్టుగా ఇండియా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 575 రన్స్ చేసింది. ఆ అత్యధిక స్కోరును ఇవాళ ఇండియా దాటేసింది.
ఇండియన్ ఇన్నింగ్స్లో షఫాలీ వర్మ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. షఫాలీ, స్మృతీ మందాన తొలి వికెట్కు అత్యధికంగా 292 రన్స్ జోడించారు. స్మృతీ మందాన 149 రన్స్ చేసి ఔటైంది. భారత వుమెన్ బ్యాటర్లలో రోడ్రిక్స్ 55, హర్మన్ప్రీత్ 69, రిచా ఘోష్ 86 రన్స్ చేశారు.
1⃣ Double Ton
1⃣ Century
3⃣ Half-centuriesAnd a record breaking total! 🤩
Follow the match ▶️ https://t.co/4EU1Kp6YTG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/GcH70yQESG
— BCCI Women (@BCCIWomen) June 29, 2024