IND vs ENG : పొట్టి ప్రపంచకప్ సెమీస్ ఫైనల్లో భారత టాపార్డర్ తడబడింది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి రెండు కీలక వికెట్లు పడ్డాయి. ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ రోహిత్ శర్మ(26) దంచుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్(5) సైతం బౌండరీతో తన ఉద్దేశాన్ని చాటాడు. దాంతో, భారత జట్టు పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 46 రన్స్ కొట్టింది.
టాస్ ఓడిన భారత్కు శుభారంభం లభించిందని మురిసే లోపు విరాట్ కోహ్లీ(9) ఔటయ్యాడు. టాప్లే వేసిన రెండో ఓవర్లో విఫలమయ్యాడు. సిక్సర్తో టచ్లోకి వచ్చిన్టటే కనిపించినా వికెట్ పారేసుకున్నాడు. ఇక టోర్నీ ఆసాంతం దంచేసిన రిషభ్ పంత్(4) సామ్ కరన్ వేసిన ఆరో ఓవర్లో సులువైన క్యాచ్ ఇచ్చేసి వెనుదిరిగాడు.