న్యూఢిల్లీ: చెస్ ప్రపంచ చాంపియన్షిప్ ఆతిథ్యం విషయంలో భారత్కు ఆశాభంగమైంది. ప్రతిష్ఠాత్మక టోర్నీ నిర్వహణ కోసం ఢిల్లీ, చెన్నై పోటీపడగా చివరికి సింగపూర్కు ఆ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ చెస్ సమాఖ్య(ఫిడే) సోమవారం ప్రకటనలో పేర్కొంది. మెగాటోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు అటు తమిళనాడు ప్రభుత్వం, ఢిల్లీ ప్రయత్నించినప్పటికీ నిరాశే ఎదురైంది.
నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 మధ్యలో జరిగే చెస్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్..చైనాకు చెందిన డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్తో ముఖాముఖి తలపడనున్నాడు. టోర్నీ చర్రితలో పోటీపడబోతున్న పిన్న వయసు జీఎంగా గుకేశ్ కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాడు. భారత్కు ఆతిథ్యం దక్కకపోవడంపై ఏఐసీఎఫ్ కార్యదర్శి దేవ్ ఏ పటేల్ నిరాశ వ్యక్తం చేశారు.