Team India |చెన్నై: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్కు తెరలేవనుంది. దాదాపు పదేండ్ల తర్వాత తొలిసారి తలపడుతున్న పోరులో ఎలాగైనా ఆధిపత్యం చెలాయించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన హర్మన్ప్రీత్కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా జోరు మీదుంటే..సుదీర్ఘ ఫార్మాట్లో దీటైన పోటీనిచ్చేందుకు సఫారీలు సై అంటున్నారు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సత్తాచాటిన పలువురు యువ క్రికెటర్లు టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేయనున్నారు. స్వదేశం వేదికగా చివరిసారి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో ఆడిన రెండు టెస్టుల్లో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఇదిలా ఉంటే నాయక ద్వయం హర్మన్ప్రీత్, మందన సూపర్ఫామ్మీద ఉండటం భారత్కు కలిసిరానుంది.