T20 World Cup 2024 : పొట్టి ప్రపంచకప్లో అంతిమ సమరం రేపే. మెగా టోర్నీలో అజేయంగా దూసుకెళ్లిన భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa)లు ఫైనల్ ఫైట్కు మరికొన్ని గంటలే ఉంది. ఐసీసీ టోర్నీల్లో సఫారీలకు ఇది తొలి ఫైనల్ కాగా.. టీమిండియాకు ఇది పదమూడో టైటిల్ పోరు. క్రికెట్ చరిత్రలో మొదటిసారి ‘సెమీస్ గండం’ గట్టెక్కిన ప్రొటిస్ టీమ్ ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలనే కసితో ఉంది. మరోవైపు 11 ఏండ్లుగా ఊరిస్తున్న ట్రోఫీని పట్టేయాలని పట్టుదల రోహిత్ సేనలో కనిపిస్తోంది. దాంతో, ఈసారి టైటిల్ మురిపెం ఎవరిది? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
టీ20 ప్రపంచ కప్ తొమ్మిదో సీజన్లో భారత్, దక్షిణాఫ్రికాలది అజేయ ప్రస్థానం. ఒకరకంగా ఇది ఐసీసీ టోర్నీల చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమనే చెప్పాలి. ఈ మెగా టోర్నీలో ఫేవరెట్ ట్యాగ్ను నిలబెట్టుకుంటూ టాప్ షోతో ప్రత్యర్థులను వణికించాయి. రెండు జట్లలో కామన్ పాయింట్ ఏమంటే.. బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
ఇక కెప్టెన్సీ విషయానికొస్తే ఎడెన్ మర్క్రమ్ (Aiden Markram) ఒత్తిడిలోనూ కూల్గా ఉంటున్నాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) అయితే.. ప్రశాంతంగా ఉంటూనే పరుగుల వరద పారిస్తూ తనదైన వ్యూహాలతో జట్టును గెలుపు బాటలో నడిపిస్తున్నాడు. ఓటమెరుగని ఈ రెండు జట్ల మధ్య ఫైన్లను ‘సమఉజ్జీల యుద్ధ’మని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
2️⃣ Unbeaten teams 1️⃣ Trophy at stake
South Africa and India will face off in Barbados for the ultimate prize 🏆#T20WorldCup #SAvIND pic.twitter.com/j8DC9YFIbM
— ICC (@ICC) June 27, 2024
అమెరికా గడ్డపై లీగ్ దశలో అదరగొట్టిన భారత్.. దక్షిణాఫ్రికాలు సూపర్ 8లోనూ పట్టు సడలించలేదు. ఇక కీలకమైన తొలి సెమీస్లో సఫారీ బౌలర్లు అఫ్గనిస్థాన్ను 56 పరుగులకే కట్టడి చేయగా.. మర్క్రమ్ సేన తమ జట్టుపై పడిన చోకర్స్ ముద్రను చెరిపేసింది. రెండో సెమీస్లో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్కు చెక్ పెట్టింది. రోహిత్ శర్మ(57) అర్ధ శతకంతో మెరవగా.. అక్షర్ పటేల్(3/23), కుల్దీప్ యాదవ్(3/19)లు తిప్పేయడం బట్లర్ సేన బొక్కబోర్లా పడింది.
భారత్ ఆటగాళ్లకు ఫైనల్లో సఫారీ పేసర్ల నుంచి ముప్పు ఉంది. ముఖ్యంగా పవర్ ప్లేలో అన్రిచ్ నోకియా, రబడ, జాన్సెన్లు వికెట్ల వేట కొనసాగించడమే అందుకు కారణం. ఇక మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు తబ్రేజ్ షంసీ, కేశవ్ మహరాజ్ల నుంచి ముప్పు పొంచి ఉంది. సెమీస్లో 3 వికెట్లతో రాణించిన షంసీ భారత్పై మెరుగైన ప్రదర్శన చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా పటిష్టంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా బ్యాటింగ్లో మాత్రం తడబడుతుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton De kock), రీజా హెండ్రిక్స్ల జోడీ శుభారంభం ఇవ్వడంలో విఫలమవుతుంది. కెప్టెన్ మర్క్రమ్ సైతం ఇప్పటివరకూ పెద్ద స్కోర్ చేయలేదు. ఐపీఎల్ 17వ సీజన్లో ఉతికేసిన కుర్రాడు ట్రిస్టన్ స్టబ్స్ (Tristan Stubbs), హెన్రిచ్ క్లాసెన్తో పాటు డేవిడ్ మిల్లర్లపై సఫారీ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది.
టీమిండియా విషయానికొస్తే.. వరల్డ్ కప్లో రోహిత్ సేన జైత్రయాత్రకు సమిష్టితత్వమే కారణం. టాపార్డర్లో కెప్టెన్ రోహిత్ శర్మ వీరబాదుడు బాదుతుంటే.. మిడిలార్డర్లో రిషభ్ పంత్ (Rishabh Pant), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (Hardhik Panday)లు కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఒత్తిడిలోనూ ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వకుండా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు.
అయితే.. ఓపెనర్ విరాట్ కోహ్లీ వైఫల్యం జట్టును బాధిస్తోంది. వరల్డ్ క్లాస్ ఆటగాడైన విరాట్ సెమీస్లోనూ 9 పరుగులతో నిరాశపరిచాడు. దాంతో, ఫైనల్లో అయినా కోహ్లీ ఫామ్ అందుకోవాలని భారత్ భావిస్తోంది. బౌలింగ్ యూనిట్ అయితే భీకర ఫామ్లో ఉంది. పవర్ ప్లేలో బుమ్రా, అర్ష్దీప్ సింగ్లు హడలెత్తిస్తుంటే.. చైనామన్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేస్తున్నారు. టీమిండియా ఖాతాలో రెండో టీ20 వరల్డ్ కప్ టైటిల్ చేరాలంటే.. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లో రేపు (జూన్ 29న) మళ్లీ సమిష్టి సూత్రమే మంత్ర అవ్వాలి.
India are up and running in Guyana 🔥#T20WorldCup | #INDvENG | 📝: https://t.co/zN7urMU4cD pic.twitter.com/QfPav73BxB
— ICC (@ICC) June 27, 2024