IND vs SA : టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ(ICC) అంపైర్లను ఖరారు చేసింది. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే టైటిల్ పోరుకు క్రిస్ గఫ్ఫానే(న్యూజిలాండ్), రిచర్డ్ ఇల్లింగ్వర్త్(ఇంగ్లండ్)లు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. రిచర్డ్ కెటిల్బరో(ఇంగ్లండ్) టీవీ అంపైర్గా, రోడ్ని టక్కర్ ఫోర్త్ అంపైర్లుగా ఎంపికయ్యారు. వెస్టిండీస్ మాజీ ఆటగాడు రిచీ రిచర్డ్సన్ (Richie Richardson) మ్యాచ్ రిఫరీగా ఉండనున్నాడు.
తొమ్మిదో సీజన్లో అజేయంగా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ ఫైట్ ఆసక్తికరంగా ఉండనుంది. జూన్ 29న జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరుజట్లు బార్బడోస్ చేరుకున్నాయి. బ్రిడ్జ్టౌన్లోని రోహిత్ శర్మ బృంద మర్క్రమ్ సేనతో తలపడనుంది. క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈమ్యాచ్కు వాన ముప్పు ఉందని సమాచారం. మ్యాచ్ రోజున బ్రిడ్జ్టౌన్లో మేఘాలు కమ్మి ఉంటాయని, వాన కురిసేందుకు 60 శాతం చాన్స్ ఉందని టాక్. దాంతో, పూర్తి స్థాయిలో 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోవచ్చు.
వరుణుడు అంతరాయం కలిగిస్తే.. 190 నిమిషాల అదనపు టైమ్ ఉంది. ఒకవేళ అప్పటికీ ఔట్ ఫీల్డ్ తడిగా ఉంటే ఎలాగూ రిజర్వ్ డే ఉండనే ఉంది. అప్పుడు రిజర్వ్ డే అయిన జూన్ 30వ తేదీ ఆదివారం యథావిధిగా మ్యాచ్ అరంభమవుతుంది. ఆ రోజు కూడా వాన అంతరాయం కలిగిస్తే కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. చివరకు అదీ కూడా వీలు పడలేదంటే.. భారత్, దక్షిణాఫ్రికాలను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
The unstoppable forces meet 🇿🇦🇮🇳
Aiden Markram 🆚 Rohit Sharma – who will lift the #T20WorldCup trophy? 🤔 pic.twitter.com/hlR4hasBIp
— ICC (@ICC) June 28, 2024