హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుసేన్సాగర్ వేదికగా 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ హోరాహోరీగా సాగుతున్నది. పోటీలకు తొలి రోజైన బుధవారం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన సెయిలర్లు వేర్వేరు విభాగాల్లో పోటీపడ్డారు. పురుషుల ఐఎల్సీఏ-7 విభాగంలో మోహిత్సైనీ ఆధిక్యంలో నిలిచాడు.
అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో మహాప్రభు, సికాంశుసింగ్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. మహిళల ఐఎల్సీఏ-6 విభాగంలో రితిక, ఐఎల్సీఏ 6 ఓపెన్ కేటగిరీలో రామ్ మిలాన్, 470 క్లాస్లో శ్రద్ధ వర్మ, ఆర్కేశర్మ అగ్రస్థానాలు కైవసం చేసుకున్నారు. సాగర్ జలాలపై బలంగా వీస్తున్న గాలులను అనుకూలంగా మలుచుకుంటూ సెయిలర్లు సత్తాచాటారు.