HCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి: బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘తెలంగాణ క్రికెటర్ల శ్రేయాస్సును దృష్టిలో పెట్టుకుని హెచ్సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా మాజీ క్రికెటర్ వెంకటేశ్ప్రసాద్ నియమించేందుకు చర్చలు జరుపుతున్నాం. జిల్లా కేంద్రాల్లోనూ స్టేడియాల నిర్మాణానికి కసరత్తు మొదలుపెట్టాం’ అని అన్నారు. ఈనెల 8 నుంచి దేశవాళీ క్రికెట్ మొదలవుతుందని కార్యదర్శి దేవరాజ్ పేర్కొన్నారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న ఆడిట్ను క్లియర్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సునీల్ పాల్గొన్నారు.