గడిచిన నాలుగు వారాలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ కీలక దశకు చేరింది. గ్రూప్, సూపర్-8 దశలలో రసవత్తర పోరాటాలను అందించి టైటిల్ ఫేవరేట్స్గా భావించిన పలు అగ్రశ్రేణి జట్లు నిష్క్రమించడంతో ఈ టోర్నీలో మిగిలిన 4 జట్లు (దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్, భారత్-ఇంగ్లండ్) గురువారం జరిగే ‘సెమీస్ సమరం’లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం నేడు ఉదయం 6 గంటలకు దక్షిణాఫ్రికాతో అఫ్గన్ పోటీ పడనుండగా రాత్రి 8 గంటలకు డిఫెండింగ్ చాంపియన్తో రోహిత్ సేన తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తొలి సెమీస్లో ఎవరు గెలిచినా అది కొత్త చరిత్రే కానుండగా రెండో సెమీస్లో ఇంగ్లండ్పై గెలిచి గత టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్సేన భావిస్తోంది.
T20 World Cup | గయానా:టీ20 ప్రపంచకప్లో టైటిల్ ఫెవరేట్లుగా భావిస్తున్న భారత్, ఇంగ్లండ్ కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ టీమ్ఇండియా కప్ వేటలో దూసుకెళుతున్నది. గత 17 ఏండ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న పొట్టి ప్రపంచకప్ను ఈసారైనా ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న రోహిత్సేన ఆ దిశగా ఒక్కో మెట్టు అధిరోహిస్తున్నది. గత ప్రపంచకప్(2022)లో ఇదే ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదుర్కొన్న భారత్ ప్రతీకారంతో రగిలిపోతున్నది. ఆస్ట్రేలియా గడ్డపై తమకు ఎదురైన ఓటమికి కరీబియన్ దీవుల్లో బదులు తీర్చుకోవాలని చూస్తున్నది.
తమ కెరీర్లో దాదాపు ఆఖరి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న రోహిత్శర్మ, విరాట్కోహ్లీ తమ చిరకాల కలను సాకారం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. కోహ్లీ ఫామ్ టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. ఆడిన 6 మ్యాచ్ల్లో 66 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. మరి కీలకమైన సెమీస్లో కోహ్లీ జూలు విదిలిస్తాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు కెప్టెన్ రోహిత్..ఆస్ట్రేలియాపై మ్యాచ్తో టచ్లోకి వచ్చాడు. స్టార్క్ను వెంటాడి వేటాడిన హిట్మ్యాన్ భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్తోనూ ఇదే రీతిలో ఆడితే టీమ్ఇండియా కప్ వేటలో మరో కీలక అడుగు వేసినట్లే. మిడిలార్డర్లో రిషబ్పంత్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే సమయోచిత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. టాపార్డర్ విఫలమైన ప్రతీసారి బ్యాటింగ్ భారాన్ని మోస్తూ జట్టు విజయాల్లో కీలకమవుతున్నారు.
బుమ్రా, కుల్దీప్ కీలకం
ఇంగ్లండ్ను దెబ్బతీయడంలో బుమ్రా, కుల్దీప్యాదవ్ కీలకం కావచ్చు. తనదైన బౌలింగ్తో ఆదిలోనే ఇంగ్లిష్ టీమ్ బుమ్రా నడ్డివిరిస్తే..మిగతా పనిని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ కానిస్తాడు. వీరికి తోడు మంచి ఫామ్మీదున్న యువ పేసర్ అర్ష్దీప్సింగ్(15 వికెట్లు) మరోమారు చెలరేగితే బట్లర్ గ్యాంగ్కు ఇబ్బందులు తప్పవు. జడేజా, అక్షర్పటేల్ లెఫ్టార్మ్ స్పిన్ తంత్రం పనిచేస్తే..డిఫెండింగ్ చాంపియన్ పని పట్టొచ్చు.
మూడోసారి కప్ కొట్టాలని
ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ టోర్నీని ముద్దాడాలని చూస్తున్న ఇంగ్లండ్ సర్వశక్తులతో సమాయత్తమవుతున్నది. కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో సమిష్టి ప్రదర్శన కనబరిచే ఇంగ్లిష్ టీమ్ మరోమారు అదే స్థాయిలో టీమ్ఇండియాకు చెక్ పెట్టాలని చూస్తున్నది.
ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బట్లర్ మంచి టచ్లో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసే వీరిద్దరిలో ఏ ఒక్కరు క్రీజులో కుదురుకున్న భారత్కు కష్టాలు చుట్టిముట్టినట్లే. మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలు బాదే వీరిని పవర్ప్లేలో పెవిలియన్ పంపితే టీమ్ఇండియా లక్ష్యం నెరవేరినట్లే. మిడిలార్డర్లో బెయిర్స్టో, అలీ, లివింగ్స్టోన్, బ్రూక్, జాక్స్తో పటిష్ఠంగా కనిపిస్తున్నది. ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుకునే వీరిని కట్టడి చేయడం భారత్కు ఒక రకంగా కత్తిమీద సామే. ఆర్చర్, జోర్డాన్, రషీద్, సామ్ కరాన్తో బౌలింగ్ విభాగం..మంచి ఫామ్లో ఉంది. ముఖ్యంగా హ్యాట్రిక్ ఫీట్తో జోర్డాన్ తన సత్తా ఏంటో చూపెట్టాడు.
పిచ్, వాతావరణం
భారత్, ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్కు వర్షం అంతరాయం కల్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గయానాలో గురువారం 80శాతానికి పైగా వర్షం పడే చాన్స్ ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే చాన్స్ ఉంది. ఈ మ్యాచ్కు రిజర్వ్డే లేనందున..ఫలితం కోసం 4 గంటలు కేటాయించారు. ఒకవేళ అప్పటికీ తేలకపోతే ఫలితంతో సంబంధం లేకుండా గ్రూపు టాపర్గా భారత్ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్(కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్పటేల్, బుమ్రా, అర్ష్దీప్సింగ్, కుల్దీప్యాదవ్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), సాల్ట్, బెయిర్స్టో, బ్రూక్, అలీ, లివింగ్స్టోన్, కరాన్, జోర్డాన్, ఆర్చర్, రికీ టోప్లె, రషీద్.
తరౌబా (ట్రినిడాడ్): దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ కీలక సమరానికి సిద్ధమయ్యాయి. గురువారం ఇరు జట్ల మధ్య జరిగే తొలి సెమీస్తో నాకౌట్ దశకు తెరలేవనుంది. ఐసీసీ టోర్నీలలో ఈ రెండు జట్లు ఇంత వరకూ ఫైనల్ చేరని నేపథ్యంలో సెమీస్లో ఎవరు గెలిచినా అది కొత్తచరిత్రే కానుంది. బలాబలాలపరంగా కాబూలీల కంటే సఫారీలు కాస్త పైచేయిగా కనిపిస్తున్నా ఈ టోర్నీలో అఫ్గాన్ల పట్టుదలకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సైతం తలవంచిన నేపథ్యంలో తొలి సెమీస్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహమే లేదు.
బౌలింగే బలం:
రషీద్ ఖాన్ సారథ్యంలోని అఫ్గానిస్థాన్ ప్రధానాస్త్రం బౌలింగే. ఆరంభంలోనే ఫజల్హక్ ఫరూఖీ, నవీనుల్ హక్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ కట్టడి చేస్తుండగా స్పిన్కు అనుకూలిస్తున్న కరేబియన్ పిచ్ల మీద మధ్య ఓవర్లలో రషీద్ ఖాన్ అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాడు. నబీ, ఒమర్జాయ్, గుల్బాదిన్ తలా ఓ చేయి వేస్తున్నారు. బ్యాటింగ్లో ఆ జట్టు ప్రధానంగా ఓపెనర్లు గుర్బాజ్, జద్రాన్పైనే ఆధారపడింది. మిడిలార్డర్లో గుల్బాదిన్, ఒమర్జాయ్ బ్యాట్ ఝుళిపించాలని అఫ్గాన్ కోరుకుంటోంది.
సఫారీలు ఏం చేస్తారో?:
పేపర్పై చూస్తే సఫారీ బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది. డికాక్, హెండ్రిక్స్, మార్క్మ్,్ర క్లాసెన్, స్టబ్స్, మిల్లర్ వంటి ప్రమాదకర బ్యాటర్లు ఉన్నా ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా భారీ విజయాలు సాధించిన దాఖలాల్లేవు. నేపాల్పై ఒక్క పరుగు, బంగ్లాదేశ్పై 4 పరుగుల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా.. విండీస్పై 3 వికెట్ల తేడాతో నామమాత్రపు విజయాలు నమోదుచేసింది. అఫ్గానుల మాదిరిగానే సఫారీ జట్టు సైతం బౌలర్ల మీదే ఆధారపడుతోంది. రబాడా, నోకియా, బార్ట్మన్, జాన్సెన్ తమ పేస్ పదునుతో ప్రత్యర్థులను కట్టడి చేస్తుండగా కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీ స్పిన్తో మాయ చేస్తున్నారు. ఏండ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ట్రోఫీని అందుకునేందుకు వచ్చిన అవకాశాన్ని ప్రొటీస్ టీమ్ ఏ మేరకు వినియోగించుకుంటుందనేది ఆసక్తికరం.
తుది జట్లు (అంచనా)
అఫ్గానిస్థాన్: ఇబ్రహీం జద్రాన్, రెహ్మానుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నయీబ్, మహ్మద్ నబీ, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, ఖరొటె, నవీనుల్ హక్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, రీజా హెండిక్స్, ఎయిడెన్ మార్క్మ్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నోకియా, తబ్రేజ్ షంసీ
ఈ టోర్నీలో అత్యధిక పరుగులు గుర్బాజ్ 281
అత్యధిక వికెట్లు ఫరూఖీ 16 అఫ్గాన్ వీరులవే..