Chris Gayle : మరి కాసేపట్లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య T20 అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్లోని బార్బడోస్లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు దేశాల జట్లు స్టేడియానికి చేరుకున్నాయి. మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
సాధారణ ప్రేక్షకులతోపాటు సినీ, క్రీడా రంగ ప్రముఖులు కూడా స్టేడియానికి చేరుకుంటున్నారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలుకరించగా.. ‘ఫైనల్ ఆడుతున్న భారత్ – దక్షిణాఫ్రికా జట్లకు గుడ్లక్’ అని చెప్తూ లోపలికి వెళ్లిపోయారు.
#WATCH | Barbados: Ahead of India vs South Africa T20 World Cup Final match, former West Indies Cricketer Chris Gayle says “Good luck to both teams, India and South Africa.” pic.twitter.com/9XAaROJNVa
— ANI (@ANI) June 29, 2024