Sandeep Patil : పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ ప్రైజ్మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత వరల్డ్ కప్ ట్రోఫీ కలను నిజం చేసిన రోహిత్ సేనకు ఏకంగా రూ.125 కోట్ల నజరానా ఇవ్వనుంది. టీమిండియాకు ప్రోత్సాహకంగా పెద్ద మొత్తం ఇవ్వడాన్ని మాజీలు హర్షిస్తున్నారు. అదే సమయంలో బీసీసీఐ బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నారు. తాజాగా మాజీ ఆటగాడు సందీప్ పాటిల్ (Sandeep Patil) బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేశాడు.
అనారోగ్యంతో బాధ పడుతున్న మాజీ హెడ్కోచ్ అన్షుమన్ గైక్వాడ్ (Anshuman Gaikwad)ను బతికించాలని భారత బోర్డును పాటిల్ అభ్యర్థించాడు. ‘అన్షుమన్ ఏడాది కాలంగా బ్లడ్ క్యాన్సర్ (Blood Cancer)తో పోరాడుతున్నాడు. ఆయనను నేను ఈమధ్యే లండన్లో కలిశాను. తనకు చికిత్స నిమిత్తం డబ్బులు అవసరం ఉందని ఆయన నాతో చెప్పారు. దాంతో, ఈ విషయాన్ని నేను, దిలీప్ వెంగ్సర్కార్ కలిసి బీసీసీఐ కోశాధికారి అశిష్ షెలార్ (Ashish Shelar)కు చెప్పాం.
I am pleased to announce prize money of INR 125 Crores for Team India for winning the ICC Men’s T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination, and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches, and support… pic.twitter.com/KINRLSexsD
— Jay Shah (@JayShah) June 30, 2024
నిధుల సమీకరణ గురించి మాజీ ఆటగాళ్లతో తాను మాట్లాడుతానని షెలార్ హామీ ఇచ్చారు. దయచేసి మీరు ఆయన్ను ఆదుకోండి. ప్రతి క్రికెటర్కు తన దేశ బోర్డు సాయం చేస్తుంది. అందుకని అన్షుమన్ కేసును సీరియస్గా తీసుకొని సత్వరమే మెరుగైన చికిత్స అందించండి’ అని బీసీసీఐని సందీప్ కోరాడు.
భారత జట్టుకు అన్షుమన్ రెండు పర్యాయాలు హెడ్కోచ్గా పనిచేశాడు. 1997 నుంచి 1999 ఆ తర్వాత 2000లో కోచ్గా సేవలందించాడు. భారత క్రికెట్ను కుదిపేసిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఉదంతం తర్వాత కోచ్ అయిన అన్షుమన్ జట్టులో పరివర్తన తెచ్చాడు. అతడి హయాంలోనే దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) పాకిస్థాన్పై ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ చేపట్టింది కూడా అన్షుమన్ కోచ్గా ఉన్నప్పుడే.
అన్షుమన్, సచిన్ టెండూల్కర్