IND vs ENG : పొట్టి ప్రపంచకప్లో భారత్(India), ఇంగ్లండ్(Engalnd) సెమీస్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వాన కారణంగా టాస్ను 11: 20 ( భారత కాలమాన ప్రకారం రాత్రి 8:50) గంటలకు వేశారు. గయానాలోని ప్రొవిన్స్ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ తీసుకున్నాడు. 11:45 అంటే 9:15 గంటలకు భారత జట్టు ఇన్నింగ్స్ మొదలవ్వనుంది.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
ఇంగ్లండ్ జట్టు : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, లియాం లివింగ్స్టోన్, మోయిన్ అలీ, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్, టాప్లే.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:30 గంటలు(భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 గంటలు)కు టాస్ వేయాలి. కానీ, గురువారం ఉదయం నుంచే గయానాలో వాన దంచడం మొదలెట్టింది. దాంతో, అక్కడి ప్రొవిడెన్స్ స్టేడియం (Providence Stadium)లోని పిచ్ను పూర్తిగా కప్పేశారు. వాన తగ్గాక ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం మైదానంలోకి వచ్చారు. అయితే.. అంతలోనే మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో, అందరూ డ్రెస్సింగ్ రూమ్కు పరుగెత్తారు.