England : పొట్టి ప్రపంచ కప్ సెమీస్లోనే ఇంటికెళ్లిన ఇంగ్లండ్ (England) జట్టు సొంతగడ్డపై టెస్టు సమరానికి సిద్దమవుతోంది. వెస్టిండీస్ (West Indies)తో సిరీస్ కోసం ఆదేశ బోర్డు స్క్వాడ్ను ప్రకటించింది. తొలి రెండు టెస్టుల కోసం బెన్ స్టోక్స్ (Ben Stokes) కెప్టెన్గా 14 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. తండ్రిని కోల్పోయి ఆటకు దూరమైన స్టార్ పేసర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) ఈ సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు.
కుర్రాళ్లు దిల్లాన్ పెన్నింగ్టన్, జేమీ స్మిత్లతో పాటు చిచ్చరపిడుగు గస్ అట్కిస్సన్ (Gus Atkinson)లకు సెలెక్టర్లు తొలి సారి టెస్టు జట్టులో చోటు కల్పించారు. ఇక ఈ టెస్టు సిరీస్తో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) అంతర్జాతీయ కెరీర్ ముగించనున్నాడు.
ఇంగ్లండ్ స్క్వాడ్ : బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), గస్ అట్కిన్సన్, జేమ్స్ అండర్సన్, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్, దిల్లాన్ పెన్నింగ్టన్, జేమీ స్మిత్, డాన్ లారెన్స్.
Congratulations, lads! 👊
Our Men’s squad for the first two Tests against @windiescricket #EnglandCricket | #ENGvWI pic.twitter.com/mmPqlKDqZf
— England Cricket (@englandcricket) June 30, 2024
జూలై తొలి వారంలో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. సిరీస్లో భాగంగా ఆతిథ్య టీమ్తో క్రెగ్ బ్రాత్వైట్ (Kraigg Brathwhite) బృందం మూడు టెస్టులు ఆడనుంది. జూలై 10వ తేదీన లార్డ్స్ వేదికగా జరిగే తొలి టెస్టులో సిరీస్ షురూ కానుంది. జూలై 18 నుంచి 22 వరకూ జరిగే రెండో టెస్టుకు ట్రెంట్ బ్రిడ్జ్ వేదిక కానుంది.
ఇక ఆఖరి టెస్టు జూలై 26వ తేదీన ఎడ్జ్బాస్టన్లో మొదలవ్వనుంది. గబ్బా టెస్టులో సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన విండీస్ .. ఈసారి ఇంగ్లండ్ భరతం పట్టాలనే కసితో ఉంది. మరోవైపు భారత గడ్డపై చిత్తుగా ఓడిన బెన్ స్టోక్స్ సేన మరోసారి బజ్బాల్ ఆటతో చెలరేగాలని భావిస్తోంది.