INDW vs SAW : సొంతగడ్డపై అదరగొడుతున్న భారత మహిళల జట్టు మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. దీప్తి శర్మ(2/27), అరుంధతి రెడ్డి(2/36)ల విజృంభణతో పర్యాటక జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే.. ఓపెనర్లు లారా వొల్వార్డ్త్(61), తజ్మిన్ బ్రిట్స్(38)లు మాత్రమే రాణించారు. మిడిలార్డర్ విఫమైన చోట టెయిలెండర్లు అసమానంగా పోరాడారు. నడినె డె క్లెర్క్(26), మైకీ డి రిడ్డర్ (26)లు టీమిండియా బౌలర్లను విసిగించారు. వీళ్లిద్దరూ నిలబడడంతో సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 రన్స్ కొట్టింది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ బ్యాటింగ్ తీసుకొని జట్టుకు శుభారంభమిచ్చింది. భారత బౌలర్లను ఉతికేస్తూ తొలి వికెట్కు తజ్మిన్(38)తో కలిసి 101 రన్స్ జోడించింది. 20వ ఓవర్ ఆఖరి బంతికి ఈ జంటను అరుంధతీ విడదీసింది. ఆ కాసేపటికే మరిజానే కాప్(7)తో సమన్వయ లోపంతో తజ్మిన్ రనౌట్ కావడంతో సఫారీ జట్టు స్కోర్ నెమ్మదించింది.
ఇదే సమయంలో దీప్తి శర్మ, పూజా వస్త్రకర్లు వికెట్ల వేటతో ఒత్తిడి పెంచారు. ఒకదశలో 150లోపు పర్యాటక జట్టు ఆలౌట్ అవుతుందనిపించింది. కానీ, డె క్లెర్క్(26), రిడ్డర్(26) క్రీజులో పాతుకుపోయి సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును కదిలించారు. వీరిద్దరి పోరాటంతో సఫారీ టీమ్ స్కోర్ 200 దాటింది.