బ్రిడ్జ్టౌన్: రోహిత్ శర్మ(Rohit Sharma) అంతులేని ఆనందంలో తేలిపోయాడు. టీ20 వరల్డ్కప్ గెలిచిన ఆ క్షణాలను ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడతను. టోర్నీ ముగిసిన తర్వాత జరిగిన ఫోటో షూట్లో రోహిత్ పాల్గొన్నాడు. బ్రిడ్జ్టౌన్లోని తీరానికి ఫోటో షూట్ కోసం వచ్చిన అతను.. వరల్డ్కప్ను తన చేతుల్లో చంటి పిల్లోడిని పట్టుకుని వచ్చినట్లు వచ్చాడు. ఈ క్షణాలను నమ్మలేకపోతున్నట్లు రోహిత్ తెలిపాడు. ఇదో కలలా ఉందన్నాడు. ఇది జరగలేదన్నట్లు కూడా అనిపిస్తోందన్నాడు. బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఆ వీడియోను బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
💬💬 𝙄𝙩 𝙝𝙖𝙨𝙣’𝙩 𝙨𝙪𝙣𝙠 𝙞𝙣 𝙮𝙚𝙩
The celebrations, the winning gesture and what it all means 🏆
Captain Rohit Sharma takes us through the surreal emotions after #TeamIndia‘s T20 World Cup Triumph 👌👌 – By @Moulinparikh @ImRo45 | #T20WorldCup pic.twitter.com/oQbyD8rvij
— BCCI (@BCCI) July 2, 2024
11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను ఇండియా నెగ్గిన తీరు పట్ల రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ సందర్భాన్ని, ఈ నిమిషాన్ని, ఈ క్షణాలను ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఒక జట్టుగా చాలా కఠోరంగా శ్రమించామని, దాని వల్లే ట్రోఫీని గెలుచుకోగలిగినట్లు తెలిపాడు. చాలా తీవ్రంగా శ్రమించిన తర్వాత, మనం కోరుకున్నది దక్కితే, అప్పుడు ఆ ఫీలింగ్ బాగుంటుందని రోహిత్ పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్కప్ ఫైనల్లో గెలిచిన తర్వాత కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ మీద ఉన్న మట్టిని తన నోట్లు పెట్టుకున్నాడు రోహిత్. దాని గురించి చెబుతూ .. ముందుగా ఏమీ అనుకోలేదని, అప్పటికప్పుడు అలా చేశానని, ఆ ఫీలింగ్ను ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నాడు. జీవితంలో ఉత్తమ క్షణాలను పంచిన ఆ పిచ్ను కావాలనుకున్నానని, ఆ గ్రౌండ్ తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని, అందుకే పిచ్లోని కొంత మట్టి ముక్కను తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు.