IND vs SA : పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో ఛేదనలో సఫారీ జట్టు కష్టాల్లో పడింది. భారత స్పీడ్స్టర్లు బుమ్రా, అర్ష్దీప్ సింగ్ల ధాటికి రెండు కీలక వికెట్లు కోల్పోయింది. బుమ్రా తన తొలి ఓవర్లోనే ఓపెనర్ రీజా హెండ్రిక్స్(4)ను బౌల్డ్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ షాక్లోనే ఉన్న సఫారీలను అర్ష్దీప్ తన రెండో ఓవర్లో దెబ్బకొట్టాడు. ఎడెన్ మర్క్రమ్(4)ను ఔట్ చేసి ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్(12) జతగా ఓపెనర్ క్వింటన్ డికాక్(20) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. 6 ఓవర్లకు సఫారీల స్కోర్.. 43-2.
తొలుత ఆడిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 176కే పరిమితమైతమైంది. కీలక పోరులో కెప్టెన్ రోహిత్ శర్మ(9) విఫలమవ్వగా భారీ ఫామ్లో లేని విరాట్ కోహ్లీ(76) దంచికొట్టాడు. మెగా టోర్నీలో తొలి హాఫ్ సెంచరీతో టీమిండియాను నిలబెట్టాడు. విరాట్ విధ్వంసానికి అక్షర్ పటేల్(47) అటాక్ ఇన్నింగ్స్తో హడలెత్తించాడు. ఆఖర్లో శివం దూబే(27) ధనాధన్ ఆడడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి176 రన్స్ కొట్టింది.