Bhukya Yashwanth | లేహ్: లఢక్ రీజియన్లో ఉన్న కాంగ్ యాస్టే (6,250 మీటర్ల ఎత్తు) పర్వతాన్ని తెలంగాణ గిరిజన కుర్రాడు భూక్యా యశ్వంత్ విజయవంతంగా అధిరోహించాడు. మహబూబాబాద్లోని మరిపెడ బంగ్లా మండలం భూక్య తండాకు చెందిన యశ్వంత్.. 8 రోజుల్లో ఈ సాహసయాత్రను పూర్తిచేశాడు. అత్యంత కఠిన సవాళ్లతో కూడిన ఈ యాత్రను పూర్తిచేసిన యశ్వంత్.. ఎవరెస్ట్ను అధిరోహించడం తన లక్ష్యమని తెలిపాడు.
సాత్విక్ ద్వయానికి సులువైన డ్రా
పారిస్: ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్-చిరాగ్ జోడీకి సులువైన డ్రా ఎదురైంది. గ్రూప్-సీలో మూడో సీడ్గా బరిలోకి దిగబోతున్న భారత స్టార్ ద్వయం.. ఫజల్ అల్ఫియన్-మహ్మద్ రియాన్ (ఇండోనేషియా), 31వ ర్యాంకు జర్మన్ జోడీ మార్క్ లమ్స్ఫస్-మర్విన్ సీడెల్, 43వ ర్యాంకు ఫ్రెంచ్ షట్లర్లు లుకాస్ కొర్వి-రొనాన్ లబర్తో పోటీపడనున్నారు.