Gautam Gambhir | ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, ఐపీఎల్-17లో కోల్కతా నైట్ రైడర్స్కు మెంటార్గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్ టీమ్ఇండియాకు తదుపరి హెడ్కోచ్గా రాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సైతం ద్రవిడ్ వారసత్వాన్ని గౌతీకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బోర్డు వర్గాల సమాచారం. ఈ మేరకు బీసీసీఐ ప్రతినిధి ఒకరు.. ఇదే విషయమై గంభీర్తో చర్చించి అతడిని కోచ్ పదవికి దరఖాస్తు చేసే విధంగా మంతనాలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల వినికిడి.
‘మెన్ ఇన్ బ్లూ’కు హెడ్కోచ్ రేసులో లక్ష్మణ్, ఫ్లెమింగ్, లాంగర్, పాంటింగ్, నెహ్రా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. భారత్ గెలిచిన రెండు ఐసీసీ ట్రోఫీ (2007, 2011)లలో భాగమైన గంభీర్కు ఇప్పటిదాకా కోచ్గా పనిచేసిన అనుభవం లేదు. ఐపీఎల్లో అతడు 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా వ్యవహరించి ఈ సీజన్లో ఆ బాధ్యతను కేకేఆర్కు నిర్వర్తిస్తున్నాడు. హెడ్కోచ్ పదవికి ఐప్లె చేసేందుకు ఈనెల 27 ఆఖరితేదీ కాగా అప్పట్లోగా గౌతీ ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.