BCCI : పదమూడేండ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన భారత జట్టు (Team India)కు భారీ ప్రైజ్మనీ దక్కనుంది. యావత్ దేశాన్ని సంతోషంలో ముంచెత్తిన రోహిత్ సేనకు భారతక్రికెట్ బోర్డు (BCCI) కండ్లు చెదిరే నజరానా ప్రకటించింది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో టీమిండియా చిరస్మరణీయ విజయం అనంతరం బీసీసీఐ భారత బృందానికి ఏకంగా 125 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సెక్రటరీ జైషా (Jai Shah) ఆదివారం అధికారికంగా వెల్లడించాడు.
‘పొట్టి ప్రపంచ కప్ గెలుపొందిన భారత జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్మనీ ఇస్తున్నామని ప్రకటిస్తున్నందుకు గర్వపడుతున్నా. టోర్నమెంట్ ఆసాంతం టీమిండియా అద్భుత నైపుణ్యం, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పాటు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. ఈ గొప్ప విజయాన్ని సాధించిన ఆటగాళ్లకు, కోచ్లకు, సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు’ అని జై షా ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు.
I am pleased to announce prize money of INR 125 Crores for Team India for winning the ICC Men’s T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination, and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches, and support… pic.twitter.com/KINRLSexsD
— Jay Shah (@JayShah) June 30, 2024
పొట్టి ప్రపంచకప్ తొమ్మిదో సీజన్ ఫైనల్లో టీమిండియా(India) సూపర్ విక్టరీ కొట్టింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా (South Africa) తొలి టైటిల్ ఆశలకు చెక్ పెట్టింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టి 11 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్(52) సుడిగాలి ఇన్నింగ్స్తో భయపెట్టినా హార్దిక్ పాండ్యా(3/20), బుమ్రా(2/18), లు మ్యాచ్ను మలుపుతిప్పారు. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన పాండ్యా భారత్కు 7 పరుగుల విజయాన్ని అందించాడు. అంతే.. ‘చోకర్స్’ ముద్ర పడిన దక్షిణాఫ్రికా ఒత్తిడిని జయించలేక ట్రోఫీ చేజార్చుకుంది.