IND vs ENG : టీ20 వరల్డ్ కప్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు (India) బిగ్ ఫైట్కు సిద్ధమైంది. గయానాలో జరుగనున్న రెండో సెమీఫైనల్లో టీమిండియా బలమైన ఇంగ్లండ్ (England)ను ఢీ కొట్టనుంది. బలాబలాల పరంగా రెండు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నా.. అజేయ భారత్ గెలుపుపై ధీమాగా ఉంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ – జోఫ్రా ఆర్చర్.. జోస్ బట్లర్ – జస్ప్రీత్ బుమ్రా ల మధ్య తగ్గ పోరు ఉంటుందని విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇండియన్ బౌలర్లలో ఇంగ్లండ్ సారథిని ఔట్ చేసేది ఎవరో చెప్పేశాడు. భీకర ఫామ్లో ఉన్న బట్లర్ను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (Axar Patel) ఔట్ చేస్తాడని అశ్విన్ అన్నాడు. ‘అక్షర్ వద్ద మూడు ప్రధాన అస్త్రాలు ఉన్నాయి. అతడు అద్భుతమైన ఆర్మ్ బాల్ వేయగలడు. బంతిని తక్కువ వేగంతో విసరగలడు. అంతేకాదు బంతిని అనూహ్యంగా టర్న్ చేయగల నైపుణ్యం అక్షర్ సొంతం అని అశ్విన్ తెలిపాడు. సెమీస్లో ఒకవేళ అక్షర్తో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేయిస్తే.. అతడు బట్లర్ను ఔట్ చేయడం పక్కా’ అని యశ్ అన్నాడు.
గయానా వేదికగా రాత్రి 8 గంటలకు ఇండియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. పొట్టి వరల్డ్ కప్లో ఇంగ్లీష్ జట్టుపై 12 విజయాలతో ఆధిపత్యం చెలాయించిన భారత్… ఈసారి కూడా జయభేరి మోగించాలనే పట్టుదలతో ఉంది. అదే జరిగితే రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై సెమీస్లోనే ఎదురైన దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టే.