Archana Kamath | ఢిల్లీ: భారత యువ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి అర్చనా గిరీష్ కామత్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 24 ఏండ్ల వయసున్న అర్చన ఆటకు వీడ్కోలు పలుకుతూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఉన్నత చదువుల నిమిత్తం ఆమె తనకు ఎంతో ఇష్టమైన టీటీని వదిలేస్తున్నట్టు తెలిపింది. ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో భాగంగా మహిళల టీమ్ ఈవెంట్లో క్వార్టర్స్ చేరిన భారత జట్టులో కామత్ కూడా ఉంది.
క్వార్టర్స్లో జర్మనీ చేతిలో 3-1 తేడాతో భారత్ ఓడగా ఆ పోరులో గెలిచిన ఏకైక భారత ప్యాడ్లర్ అర్చనానే కావడం గమనార్హం. పారిస్ నుంచి తిరిగొచ్చాక తన కోచ్తో సుదీర్ఘంగా చర్చించిన ఆమె ఆటకు వీడ్కోలు పలికేందుకే సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాగా పదో తరగతిలో 98.7 శాతం, ఇంటర్లో 97 శాతం మార్కులతో చదువులో టాపర్గా ఉన్న అర్చన భవిష్యత్లో ‘ఆర్థిక శాస్త్రవేత్త’గా మారి దేశానికి సేవ చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది.