IND vs ZIM : కుర్రాళ్లతో నిండిన భారత జట్టు జింబాబ్వే సిరీస్లో తొలి మ్యాచ్కు సిద్దమైంది. శుభ్మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని యువ భారత్ శనివారం ‘హరారే స్పోర్ట్స్ క్లబ్’లో ఆతిథ్య జట్టుతో మొదటి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ గిల్ మూడో స్థానంలో బరిలోకి దిగుతాడని సమచారం. దాంతో, ఓపెనింగ్ కాంబినేషన్పై చర్చ మొదలైంది.
ఐపీఎల్లో హిట్ కొట్టిన రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)తో కలిసి ఎవరు ఇన్నింగ్స్ ఆరంభిస్తారు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు మెరుపు ఆరంభాలు ఇచ్చిన అభిషేక్.. జింబాబ్వే టూర్కు ఎంపికయ్యాడు. విధ్వంసక బ్యాటింగ్తో బౌలర్ల లయను దెబ్బతీయడంతో పాటు స్పిన్నర్గానూ రాణించే అభిషేక్ కూర్పులో సరిగ్గా సరిపోతాడు. దాంతో, రుతురాజ్కు జోడీగా ఈ యంగ్స్టర్ ఆడే చాన్స్ ఉంది.
అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన రియాన్ పరాగ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావొచ్చు. తొలిసారి టీమిండియా జెర్సీ వేసుకోనున్న పరాగ్ తన మార్క్ ఇన్నింగ్స్లతో చెలరేగుతాడా? లేదా? చూడాలి. వికెట్ కీపర్గా జితేశ్ శర్మ ప్లేస్ ఖరారు అయినట్టే.
ఇక స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అదే జరిగితే రవి బిష్ణోయ్ ప్రధాన స్పిన్నర్గా ఆడే అవకాశముంది. సీనియర్ పేసర్ ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్లు తుది జట్టులో ఉంటే.. మూడో పేసర్గా ముకేశ్ కుమార్, హర్షిత్ రానాల మధ్య గట్టి పోటీ ఉండనుంది.
భారత జట్టు అంచనా : అభిషేక్ శర్మ, రుతరాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రానా/ ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్