హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు మంగళవారం నుంచి ఘనంగా మొదలయ్యాయి. హుస్సేన్సాగర్ వేదికగా జరుగుతున్న 38వ ఎడిషన్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి సీనియర్ కల్నల్ కమాండెంట్, లెఫ్ట్నెంట్ జనరల్ జేఎస్ సిదానా హాజరయ్యారు.
ఐఎల్సీఏ 7, ఐఎల్సీఏ 6, ఐఎల్సీఏ 4 విభాగాలలో పోటీలు జరుగుతాయి. ఈ ఏడాది జరిగే పోటీలు సెయిలర్లకు యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైఏఐ) ర్యాంకింగ్ ఈవెంట్గా ఉపయోగపడనున్నాయి.