ఇబ్రహీంపట్నం, మార్చి 6 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్జడ్జి ఇందిర అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణించటం అభినందనీయమన్నారు.అనంతరం ఉత్తమ మహిళా ఉద్యోగులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు నాగరాజు, అనామిక, వైద్యాధికారి ప్రణతిరెడ్డి, ఇబ్రహీంపట్నం డీఎం అశోక్రాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
ఆత్మవిశ్వాసం మహిళలు, విద్యార్థినులు ముందుకు సాగాలని ప్రముఖ సైకాలజిస్టు చిన్మయి భరద్వాజ్ అన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్లో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదావెంకట్రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాగలక్ష్మి, రాంరెడ్డి, ప్రమోద పాల్గొన్నారు.
ముగ్గులు, ఆటల పోటీలు
షాద్నగర్టౌన్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని షాద్నగర్ ఆర్టీసీ డీఎం ఉష అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు ముగ్గులు, ఆటల పోటీలను నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆడపిల్లలను చదువులో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు మనోధైర్యంతో ముందుకుసాగాలన్నారు. మహిళలు వేసిన రంగవల్లులు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి, నిత్యం ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు.