బడంగ్పేట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సహాకరించాలి తప్ప కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy ) సూచించారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ గడ్డం ఇన్క్లెవ్ కాలనీలో ఆమె శనివారం పర్యటించారు. కాలనీలలో ఉన్న రోడ్ల దుస్థితిని పరిశీలించి కాలనీవాసులతో మాట్లాడారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే(MLA) కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అడిగినన్ని నిధులు ఇచ్చే వారని గుర్తు చేశారు. శివారు మున్సిపాలిటీలలో వెలుస్తున్న కొత్త కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తనపై బాద్యత ఉందన్నారు. సీఎం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రద్దు చేసిన రూ. 250 కోట్ల నిధులను విడుదల చేయాలన్నారు.
ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లని గుంతల మయంగా మారాయన్నారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలంటే నిధులు మంజూరు చేయాలన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రధాన రహదారులన్నింటికీ మరమ్మతులు చేయాలని కమిషనర్కు ఆదేశాలు జారిచేశారు. ఆమె వెంట కమిషనర్ రఘుకుమార్, డీఈలు యాదయ్య, జ్యోతి, బీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, తదితరులు ఉన్నారు.