ఇబ్రహీంపట్నం, జూలై 2 : నిరుద్యోగుల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తామని చెప్పి నేటికి నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరైంది కాదన్నారు. నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. గ్రూప్-1 ప్రిలిమ్స్లో 1:100ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులు పెంచాలన్నారు. ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను వాయిదా వేసి నూతన తేదీలను ప్రకటించి, అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33శాతం రిజర్వేషన్ కేటాయించాలన్నారు. కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో 46ను వెంటనే రద్దుచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు గోదాల శేఖర్రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రవీందర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సూరంపల్లి రూపక్, జిల్లా కార్యదర్శి మైలారం విజయ్కుమార్, ఆదిబట్ల మున్సిపల్ అధ్యక్షుడు వినయ్ తదితరులున్నారు.
జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి
షాబాద్ : ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని బీజేవైఏం జిల్లా అధికార ప్రతినిధి మహేందర్, అసెంబ్లీ కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మధుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…గ్రూప్-1 ప్రిలిమ్స్లో 1-100 ప్రకారం క్వాలిఫై చేయాలన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కిరణ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు మహేశ్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మాణెయ్య, నాయకులు రవీందర్రెడ్డి, హరీశ్, రవిగౌడ్, అనంతం, దయాకర్, రాఘవేందర్, విక్రమ్, భాస్కర్రెడ్డి ఉన్నారు.
కడ్తాల్ : నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి భగీరథ్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో తహసీల్దార్ ముంతాజ్ని స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భగీరథ్జీ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని ఉద్యోగాల నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. వీరి వెంట బీజేపీ మండలాధ్యక్షుడు మాన్యానాయక్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు మధుసూదన్, నాయకులు కృష్ణ, మణి, అజిత్, వినోద్, సందీప్, తరుణ్, సతీశ్, శ్రీకాంత్, మల్లేశ్ పాల్గొన్నారు.
నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
మొయినాబాద్ : నిరుద్యోగల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగశారం మొయినాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా బీజేవైఎం మండల కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గణేశ్, ట్రైనింగ్ సెల్ రాష్ట్ర ఇన్చార్జి సుదీంద్ర, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, బీజేపీ నాయకులు ప్రకాశ్, ప్రభాకర్రెడ్డి, నర్సింహారెడ్డి, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, మాధవరెడ్డి, మహేందర్, వెంకటేశ్, మధుసూదన్గౌడ్, పవనయాదవ్, మల్లేశ్ పాల్గొన్నారు.
యాచారం : నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలని బీజేవైఎం స్టేట్ లీగల్సెల్ కన్వీనర్ పగడాల శ్రీశైలం, బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవి అన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ అయ్యప్పకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, శ్రీకాంత్రెడ్డి, శ్రీధర్గౌడ్, కృష్ణ, బీరప్ప, ఐలేశ్, శ్రీనాథ్, శివమోడి, శ్రీకాంత్, శివ ఉన్నారు.
25వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలి
కొత్తూరు : 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు మంగలి రమేశ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు నాగరాజు చారి అన్నారు. నిరుద్యోగల సమస్యలపై బీజేవైఎం రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కొత్తూరు బీజేవైఎం మండలాధ్యక్షుడు అంబటి శ్రీశైలం ఆధ్వర్యంలో తహసీల్దార్ రవీందర్రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేవైఎం మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు రణధీర్గౌడ్, జనరల్ సెక్రెటరీ ప్రశాంత్, శివ, గణేశ్, బీజేపీ నాయకులు మాణిక్యం, గణేశ్, శ్రీశైలం, మల్లేశ్ పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : నిరుద్యోగుల ఉద్యోగ కలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీవర్ధన్రెడ్డి, అందే బాబయ్య, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్యాట అశోక్ అన్నారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు షాద్నగర్ పట్టణ ముఖ్యకూడలిలో మంగళవారం బీజేపీ, బీజేవైఎం నాయకులు నిరసన తెలిపి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సుబ్రహ్మణ్యం, సాయి, వివేక్, బుషికేశ్, సందీప్, విజయ్, రవీందర్, శ్యాంసుందర్, సురేశ్, వెంకటేశ్, మురళీ పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : డీఎస్సీ పరీక్షల తేదీలను వాయిదా వేసి మెగా డీఎస్సీని ప్రటించాలని మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, తహసీల్దార్ కిష్టయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం ఆయకులు పాల్గొన్నారు.