షాద్నగర్, జూన్ 20 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం చౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల జనులకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు రాష్ట్ర రైతులకు లాభం చేకూర్చే నిర్ణయాలను తీసుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ బలోపేతం కోసం మరింత శ్రమించాలని కోరారు. వీరన్నపేటకు చెందిన మహబూబ్అలీ, ఖాజాపాష, శ్రీనివాసులు, నారాయణ, నరేశ్, తోకల సత్యయ్య, శ్రీరాములు, కుమ్మరి యాదయ్య, అస్లాం, నర్సింహులు, వెంకటేశ్, ఎరుకలి నవీన్, గడ్డం రమేశ్, దివిటి కృష్ణయ్య, సోహెల్, రఫీక్, మోహిన్లతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, నాయకులు రాములు, పిట్టల చెన్నయ్య, వెంకటేశ్, జహంగీర్, మంత్రి నర్సింహ్మ, మిద్దె అంజయ్య, సత్యనారాయణ, ఉప్మాన్, ఖాజాపాష పాల్గొన్నారు
భక్తిశ్రద్ధలతో పూరీ జగన్నాథస్వామి రథయాత్ర
షాద్నగర్టౌన్ : పూరీ జగన్నాథస్వామి రథయాత్రను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీకాలనీలో నిర్వహించిన జగన్నాథస్వామి రథయాత్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రథయాత్రను షాద్నగర్ పట్టణంలో ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. పూరీ జగన్నాథస్వామి రథయాత్రతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలన్నారు. అదే విధంగా ఉదయం నుంచి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి రథయాత్ర పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి, నాయకులు భిక్షపతి, సుధీర్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.