ఇబ్రహీంపట్నం రూరల్, సెప్టెంబర్ 13: విద్యార్థినుల సౌకర్యార్థం అధునాతన వసతులతో నిర్మాణం పూర్తైన కస్తూర్బాగాంధీ పాఠశాల నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైనది. ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకంచలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.05 కోట్లతో నూతనంగా నిర్మించిన ఈ పాఠశాల భవనాన్ని బుధవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. గతం లో నిర్మించిన భవనంలో సౌకర్యాలు సరిపడా లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవల తాగునీటితోపాటు ఇతర వసతులు లేక రోడ్డుపైకి వచ్చి న విద్యార్థినులకు మంత్రి సబితారెడ్డితోపాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం… వారం రోజుల్లోనే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నింటినీ పూర్తి చేయించి ప్రారంభానికి సిద్ధం చేశారు.
విద్యార్థినుల సౌకర్యార్థం నూతన భవనంలో విద్యుత్దీపాలు, ఫ్యాన్లు, తాగునీటి నల్లాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విశాలమైన తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్తోపాటు సకల వసతులను కల్పించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య భారం కాకూడదనే ఉద్దేశంతో మండలానికి ఒక్కటి చొప్పున గురుకులాలను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా నే రూ.2.05కోట్లతో ఇబ్రహీంపట్నంలో కస్తూర్బాగాంధీ పాఠశాల నూతన భవనాన్ని నిర్మించగా… నేడు మంత్రి సబితారెడ్డి ప్రారంభించనున్నారు.
తీరనున్న కష్టాలు..
గత ఉమ్మడి ప్రభుత్వాల హయాంలో నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాలలో సరైన వసతుల్లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేసి అన్ని హంగులతో నూతన భవనాలను నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం సమీపంలో నిర్మించిన కస్తూర్బాగాంధీ నూతన భవనంలో అన్ని వసతులు ఉండటంతో విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ కష్టాలు తీరనున్నాయని పేర్కొంటున్నారు.
రూ.2.05 కోట్లతో నూతన భవన నిర్మాణం
గతంలో నిర్మించిన పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో నిత్యం విద్యార్థినులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రూ.2.05 కోట్లను తీసుకొచ్చి అన్ని హంగులతో నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేశాం. పూర్తయిన ఈ భవనాన్ని నేడు మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థినులను నూతన భవనంలోకి తరలించనున్నాం. – మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం