రంగారెడ్డి, జూన్ 27 (నమస్తే తెలంగాణ): మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల ద్వారా చిన్నపాటి వ్యాపారాలు కొనసాగిస్తున్న స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్హెచ్జీ)ను మరింత బలోపేతం దిశగా కార్యాచరణను రూ పొందిస్తున్నది. ఇందులో భాగంగా వారితో క్యాంటీన్లు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో ఐదు మహి ళాశక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని సంకల్పించగా.. ఇం దుకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే కసరత్తును మొదలుపెట్టింది.
ఇప్పటికే రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం క్యాంటీన్లను ప్రారంభించగా.. జిల్లాకు చెందిన మహిళా సభ్యులు క్యాంటీన్ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. ఇదే క్రమంలో జిల్లాలోని ఐదు ప్రాం తాల్లో క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన పట్టణాల్లో ప్రజ లు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక్కో యూనిట్ ధర రూ.15-25 లక్షల వరకు ఉండనున్నట్లు తెలిసింది. మహిళా సంఘాల నేతృత్వంలోనే క్యాంటీన్లు కొనసాగనున్నాయి. క్షేత్రస్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించి ఆసక్తి చూపే సంఘాల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే నెల మొదటి, రెండు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి సం ఘాల మహిళలకు శిక్షణనూ ఇవ్వనున్నారు. జూలై రెం డోవారంలో లాంఛనంగా కలెక్టరేట్లో క్యాంటీన్ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎస్హెచ్జీలకు ఈసారి ప్రభుత్వం ఏకరూప దుస్తులను కు ట్టించే బాధ్యతలను అప్పగించగా వారు సక్సెస్ అయ్యారు. ఇదే తరహాలో మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నది. మీ-సేవా కేంద్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు, కస్టమ్ హైరింగ్, కుట్టు కేంద్రాలు, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ, సంచార మత్స్య విక్రయ ఔట్లెట్లు, మిల్క్పార్లర్లను ఏర్పాటు చేసేందుకు మండలాల వారీగా ప్రణాళిక రెడీ చేస్తున్నారు. యూనిట్లను నెలకొల్పేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. ఎంపిక చేసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు.
మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి పథకాల ద్వారా రుణాలను అందిస్తున్నది. జిల్లాలో 19,209 స్వయం సహాయక సంఘాలుండగా..వాటిలో 2,06,116 మం ది సభ్యులుగా ఉన్నా రు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12,950 సంఘాలకు రూ.708.79 కోట్లు రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుని..అంతకుమించి 13,119 సంఘాలకు రూ.790.46 కోట్ల రుణాలను అందించారు. గతేడాదితో పోలిస్తే రూ.60 కోట్లు అదనంగా ఈ ఏడాది రూ.850.39 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేయనున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో జిల్లాలోని మహిళా సంఘాలు స్వయం సమృద్ధి దిశగా ముం దుకు సాగుతున్నాయి. సభ్యుల ఆర్థిక అవసరాల మేరకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, కిరాణాషాపులు, పిండిగిర్నీ, టైలరింగ్, బ్యూటీపార్లర్, ఫుట్వేర్ తదితర వ్యాపారాలకు రుణాలను అందిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన సంఘాలు ఆరు నెలలపాటు క్రమం తప్పకుం డా పొదుపు చేస్తే వారికి కూడా విరివిగా రుణాలను అందజేస్తున్నారు. గతంలో బ్యాంకు లింకేజీ కింద రూ.లక్ష రుణం ఇచ్చేవారు. అయితే రెం డేండ్ల నుంచి ఆ మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచారు. ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా రాణిస్తున్నారు.
మహిళా సంఘాలకు క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఐదుచోట్ల నిర్వహణకు అనువైన స్థలాలను గుర్తించను న్నాం. అర్హులైన మహిళా సంఘాలను ఎంపిక చేసి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తాం. ఇతర యూనిట్లను సైతం నెలకొల్పి మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా చర్యలు తీసుకుంటునన్నాం. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-శ్రీలత, డీఆర్డీవో, రంగారెడ్డి జిల్లా