‘స్వరాష్ట్రం వచ్చినప్పటి నుంచి పదేండ్ల కాలంలో కరెంట్కు ఢోకా లేదు. 2014కు ముందు అరకొర విద్యుత్తు సరఫరాతో అన్నదాతలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటి ప్రభుత్వాలు ఎవుసానికి ఆరేడు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చేవి. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయేవి. రాత్రి వేళల్లో త్రీ ఫేస్ సరఫరాను నిలిపేసేవారు. విష పురుగుల బారిన పడి, విద్యుదాఘాతాల వంటి ప్రమాదాలతో ఎంతో మంది అన్నదాతలు మృతి చెందారు. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ గత కాంగ్రెస్ పాలనను గుర్తుకు తెస్తున్నది. విద్యుత్తు కోతలు పెట్టడమే పనిగా పెట్టుకున్నది. విద్యుత్తు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. రైతులు పొలాల వద్దే నిరీక్షించాల్సిన దుస్థితి వచ్చింది. అస్తవ్యస్థంగా ఉన్న కరెంట్ను గాడిన పెట్టింది కేసీఆరే. మంచి చేసిన ఆయనపై నిందలు వేయడం తగదు. కరెంటు విషయంలో తప్పు పట్టాల్సిందేమీ లేదు’ అని రైతులు, ప్రజలు తదితరులు పేర్కొంటున్నారు.
– న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ
పదేండ్లపాటు విద్యుత్తు కష్టాలే తెలియదు. కేసీఆర్ సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి సరఫరా చేశా డో తెలియదు కానీ.. మేము ఎప్పుడూ విద్యుత్తు కోసం ఎదురు చూ డలేదు.. పదేండ్ల నుంచి వ్యవసాయం పండుగలా చేసుకున్నాం.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాక ముందు ఎలాంటి ఇబ్బందులు పడ్డామో.. మళ్లీ ఇప్పుడు ఆ కష్టాలే పడాల్సిన పరి స్థితి వచ్చింది. గ్రామాల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియడంలేదు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా అయ్యింది. 2014 కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. దీంతో స్వరాష్ట్రంలో ఎవ్వరూ విద్యుత్తు కోతలతో ఇబ్బంది పడొద్దనే సదుద్దేశంతో కేసీఆర్ నిరంతరంగా సరఫరా చేశారు. అటు వ్యవసాయం చేసే రైతులతోపాటు గృహ వినియోగదారులకు కూడా విద్యుత్తు కష్టాలను దూరం చేశారు. అన్ని వర్గాల బాగు కోసం నిరంతరం పరితపించిన ఆయన్ను బద్నాం చేయడం సరికాదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్తు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలే దు. 24 గంటలపాటు సరఫరా ఉండేది. కానీ రేవంత్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు.. విద్యుత్తు సరిగా లేకపోవడంతో రైతులందరూ ఇబ్బందులు పడుతున్నా రు. గ్రామాల్లో కరెంట్ పోయిందంటే కేసీఆర్ సార్ నే గుర్తు చేసుకుంటున్నారు. ఆయనపై నిందలు తగవు.
-విజయ్ కుమార్, పంచలింగాల్, మర్పల్లి, వికారాబాద్ జిల్లా
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా మారింది. 2014 కంటే ముందు కరెంట్ కోతలతో రైతులు వ్యవసాయం అం టేనే భయపడ్డారు. అరకొర విద్యుత్తు సరఫరాతో పంటలు ఎండిపో యి రైతులు అప్పులపాలయ్యారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా కరెంట్ కో సం తిప్పలు పడొద్దనే 24 గం టలపాటు విద్యుత్తును సరఫరా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఆయన వచ్చిన తర్వా తే తెలంగాణ రైతుల జీవితాలు బాగుపడ్డాయి.
– సూద యాదయ్య, హైతాబాద్, షాబాద్, రంగారెడ్డి జిల్లా