దోమ, మే 26 : గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల నిర్వహణ కరువై చెట్లు ఎండుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా గోచరిస్తున్నది. తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ఓ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి విరివిగా మొక్కలు నాటి వాటి నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పజెప్పింది.
దానికి భిన్నంగా దోమ మండల పరిధిలోని గుండాల గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలోని మొక్కలు సరైన సమయంలో నీరు అందించకపోవడంతో చెట్లు ఎండిపోయాయి. పల్లె ప్రకృతి వనాలు, అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల పెంపకానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్తో పాటు ట్యాంకర్ను సమకూర్చింది. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనంలోని చెట్లను కాపాడాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.