వికారాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్యవిద్యను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా దవాఖానల నిర్మాణానికి కూడా నిధులిచ్చింది. సూపర్ స్పెషాలి టీ వైద్యసేవలందించే మెడికల్ కాలేజీ అనుబం ధ దవాఖానగా అందుబాటులోకి వస్తుందని రెండేండ్లుగా ఎదురుచూస్తున్న జిల్లా ప్రజానీకానికి నిరాశ మాత్రం తప్పడం లేదు. అనుబంధ దవాఖాన భవన నిర్మాణ పనులు పూర్తైనా చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉండడంతో ఆ భవనాన్ని అందుబాటులోకి తేవడంలేదు. అధికా రంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో విద్యుత్తు, పైప్లైన్, ఫర్నిచర్ తదితర పనులు పెండింగ్లోనే ఉన్నాయి.
జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థులకు రెండోసంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ తరగతులు ప్రా రంభం కానున్నాయి. ఓ వైపు మొదటి సంవత్స రం పూర్తవుతుండడం, మరోవైపు ఇంకా అనుబంధ దవాఖాన అందుబాటులోకి రాకపోవడంతో ప్రాక్ట్టికల్ తరగతులను వికారాబాద్లో ని సీహెచ్సీ దవాఖానలో నిర్వహించాలని కాలే జీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ ప్రభుత్వం స్పందించి నిధులు మంజూ రు చేసినా పనులు పూర్తై ఆ భవవాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆరునెలల సమ యం పట్టే అవకాశం ఉన్నది. దీంతో వికారాబాద్లోని సీహెచ్సీలోనే ప్రాక్టికల్ తరగతులు నిర్వహించేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధం గా నిర్మిస్తున్న 380 ప్రభుత్వ జనరల్ దవాఖానతోపాటు 20 పడకల ఐసీయూ కలిపి మొ త్తం 400 పడకల దవాఖాన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.30 కోట్లను విడుదల చేసింది. ఆ నిధులతో అనుబంధ దవాఖాన భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యా యి. చిన్న చిన్న పనులకు నిధుల కొరత ఏర్పడి ఆరు నెలలుగా నిలిచిపోయాయి.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనుబంధ దవాఖాన నిర్మాణంతో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందు బాటులోకి వస్తాయని ఆశించిన జిల్లా ప్రజల కు ఇంకా ఎదురుచూపులే మిగిలాయి. దీంతో వారికి సాధారణ వైద్యసేవలు మినహా మిగతా వైద్యసేవలకు హైదరాబాద్కు వెళ్లాల్సిందే. జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్లేసరికి మార్గమధ్యంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులున్నాయి.
ఈ దయనీయ పరిస్థితి త్వరలోనే పోతుందని అనుకున్నా జిల్లావాసులకు నిరీక్షణ, నిరాశ మాత్రం తప్పడం లేదు. అయితే జిల్లా మెడికల్ కాలేజీ అనుబం ధ దవాఖాన అందుబాటులోకొస్తే అన్ని రకాల వైద్యసేవలు నిరంతరం అందడంతోపాటు అ త్యాధునిక వైద్య చికిత్సలూ ప్రజలకు చేయ నున్నారు. అదేవిధంగా ప్రస్తుతం 12 వైద్య సేవలు కొనసాగుతుండగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనుబంధ దవాఖానగా మారితే 26 రకాల వైద్యసేవలు జిల్లావాసులకు అందనున్నాయి. అంతేకాకుండా ఐసీయూ, ట్రామా కేంద్రాల సేవలూ అందనున్నాయి. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారుతాయి.