రంగారెడ్డి, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని.. అందుకు ప్రభుత్వం, పోలీసుశాఖ, యువ త, సమాజంలోని అన్ని వర్గాల వారు సమష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం-అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురసరించుకొని తుకుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఫ్యాబ్సిటీ ఆవరణలో పోలీసు, ఎక్సైజ్, మహి ళా, శిశు సంక్షేమ, మెడికల్ శాఖల సంయుక్తాధ్వర్యంలో గురువారం వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ శశాం క, రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయిం చి.. మాట్లాడుతూ సమాజానికి పట్టిన చీడపురుగు లాంటి డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నదన్నారు. డ్రగ్స్ వినియోగం దుష్ప్రభావాల గురించి యువతకు పరిజ్ఞానం కల్పించేందుకు సోషల్ మీడియాతోపాటు కళాశాలల్లో రాచకొండ కమిషనరేట్ ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
కార్యక్రమానికి ముందు కలెక్టర్ శశాంక, రాచకొండ సీపీ తరుణ్జోషి వాకథాన్ను జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, కందుకూ రు ఆర్డీవో సూరజ్కుమార్, మహిళా, శిశు, సంక్షేమ శాఖల అధికారిణి పద్మజారమణ, డీసీపీ క్రైమ్ అరవింద్బాబు, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషావిశ్వనాథ్, ఏసీపీ నరేందర్గౌడ్ అధికారులు, పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
సాధారణ ప్రజలు, విద్యార్థులంతా డ్రగ్స్ రహిత సమాజం తమ బాధ్యతగా భా వించాలన్నారు. మత్తు పదార్థాల బారిన పడడంతో యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది. యువతీయువకు లు వాటికి దూరంగా ఉండాలి.
-తరుణ్జోషి, రాచకొండ పోలీస్ కమిషనర్