రంగారెడ్డి, జూన్ 24(నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను సోమవారం ఇంటర్మీడియల్ బోర్డు విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 2,54,498 మంది రాయగా..1,62,520(63.86 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఫస్టియర్ ఒకేషనల్లో 53.24శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్ పరీక్షలను 1,38,477 మంది విద్యార్థులు రాయగా..60,615(43.77 శాతం)మంది పాస్ అయ్యారు. సెకండియర్ ఒకేషనల్లో 51.12శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.