హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదవగా, మరో 163 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఇప్పటిరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,254కు చేరింది. ఇందులో 2,95,707 మంది బాధితులు మహమ్మారిబారినుంచి బయటపడ్డారు. కొత్తగా ఒక్క మరణం కూడా నమోదవలేదని ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, ఇప్పటివరకు ఇప్పటివరకు 1635 మంది మృతిచెందారు.
మొత్తం కేసుల్లో 1912 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 796 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 29 కేసులు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో రికవరీ రేటు 98.81 శాతం ఉండగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉన్నదని తెలిపింది. నిన్న ఒక్క రోజే 40,444 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, మొత్తంగా 88,01,651 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.