మాక్లూర్, జూలై 1: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను ఒప్పించి ఎత్తిపోతల పనులకు రూ.11.71కోట్ల నిధులు మంజూరు చేయించానని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మండలంలోని ధర్మోరా గ్రామ పంచాయతీ పరిధిలోని లక్నాపూర్ శివారులో గుత్ప ఎత్తిపోతల పంప్హౌస్ వద్ద నిర్మించనున్న ముల్లంగి(బీ), బొంకన్పల్లి గ్రామాల ఎత్తిపోతల పనులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డితో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేసుకుందామని అన్నారు. తన పదవి కాలం ఈ నెల 4తో పూర్తవుతున్నందున మిగతా పనులు పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. రూ.3.60లక్షల నిధులతో ఏడు గ్రామాలకు బీటీ రోడ్లు, రూ.11.71కోట్లతో ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. తనను రాముడిగా పోల్చిన ఎమ్మెల్యే.. లక్ష్మణుడిలా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. సాగునీటి కోసం అవస్థలుపడ్డ రెండు గ్రామాల రైతుల చిరకాల వాంఛ మరో మూడు నెలల్లో తీరనుండడంపై హర్షంవ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. సీఎం సొంత జిల్లాలోని కొడంగల్కు రూ. 1425కోట్ల నిధులు తీసుకెళ్లి మిగతా జిల్లాలకు మొండిచెయ్యి చూపుతున్నారని అన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్మూర్కు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను మంజూరు చేయాలని కోరగా ఇచ్చినట్లే.. ఇచ్చి దక్షిణ తెలంగాణకు తరలించారని అన్నారు. ఐదు వేల మంది అమ్మాయిల కోసం ఎనిమిది అంతస్తుల పాఠశాలకు రూ.100కో ట్లు మంజూరు చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సూచనలతో ఆమరణ నిరాహార దీక్ష ఆపానని అన్నారు. పార్టీలన్నీ ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి పనులు చేసుకుందామని కోరారు. రూ.11.71కోట్లు మంజూరు చేయించిన జడ్పీ చైర్మన్ విఠల్రావును అభినందిస్తూ తనను లక్ష్మణుడిలా సంబోధించినందుకు బ్యాలెన్సింగ్ నిధులు మం జూరు చేయించి పనులు పూర్త్తిచేయిస్తానని వాగ్ధానం చేశారు. మాక్లూర్ పీఏసీఎస్లో జరిగిన అవినీతిపై ఆరాతీస్తున్నామన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ యశస్విని, ఈఈ భానుప్రకాశ్, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు రమణారావు, పీఏసీఎస్ చైర్మన్ బురోల్ల అశోక్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.