తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నెల 4వతేదీతో పదవీకాలం ముగుస్తుండడంతో జడ్పీ చైర్మన్లతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విఠల్రావుకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కుటుంబీకులతో కలిసి జడ్పీ చైర్మన్ విఠల్రావు.. కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.