లింగంపేట, జూన్ 26: భూమి కోసం దాతలు చేసిన నిరసనపై నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. 1985 నుంచి 1992వ సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాల అని రికార్డుల్లో నమోదై ఉన్నట్లు తహసీల్దార్ నరేందర్ తెలిపారు. 1992 నుంచి 2024వరకు భూదాతలపై రికార్డుల్లో నమోదైనట్లు పేర్కొన్నారు. పాఠశాల భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలం సర్వే చేయించి బాధితులకు అందించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.