ధర్పల్లి, జూలై 2 : బీఆర్ఎస్ ప్రభుత్వం, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అధికారుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేసినట్లు ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి అన్నారు. ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసిన సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మున్ముందు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. అభివృద్ధికి సహకరించిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎంపీపీ దంపతులు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీవో రాజేష్, ఏఈలు మండల అధికారులు, ఏపీవో వినోద, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సిరికొండ, జూలై 2: ఎంపీటీసీల పదవీకాలం ముగియనుండడంతో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, ఎంపీటీసీలను మంగళవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మలావత్ సంగీతా రాజేందర్ మాట్లాడుతూ… మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
మోపాల్ మండలంలో..
ఖలీల్వాడి(మోపాల్), జూలై 2 : మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లింగం, సిబ్బంది పాల్గొన్నారు.