వినాయక్నగర్, జూన్ 27: నిద్రలో ఉన్న భర్తను బంధించి వాతలు పెట్టిందో భార్య. తాగొచ్చిన ఇంటాయనను కట్టేసి కాళ్లు, చేతులు, ముఖానికి సురుకులు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్కు చెందిన మహేశ్కు, మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన సుమలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్లంబర్గా పని చేసే మహేశ్కు కొద్దిగా తాగే అలవాటు ఉంది. అయితే, నాలుగు రోజుల క్రితం పనికి వెళ్లి వచ్చిన అతడు రాత్రి నిద్రకు ఉపక్రమించాడు. కాసేపటికే భార్య సుమలత అతని కాళ్లు, చేతులు కట్టేసి, ఇనుప రాడ్డును కాల్చి కాళ్లు, చేతులు, ముఖంపై వాతలు పెట్టింది. ఆ మంటలకు తాళలేక మహేశ్ గట్టిగా అరవడంతో భార్య పిల్లలను తీసుకుని పారిపోయింది. తర్వాతి రోజు బాధితుడు ఆరోటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజులైనా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని వాపోయాడు.
శక్కర్నగర్, జూన్ 27: నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం జాప్యం లేకుండా పునరుద్ధరించాలని కార్మిక సంఘ నాయకులు అన్నారు. బోధన్ పట్టణం శక్కర్నగర్లోని ఎన్ఎస్ఎఫ్ మెయిన్ గేటు ఎదుట కార్మిక సంఘం నాయకులు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారంతోపాటు ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయమై చర్చించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరించేందుకు కమిటీ వేసిన ప్రభుత్వం.. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వేతన బకాయిల చెల్లింపు విషయమై ఆలోచించాలన్నారు. ఈ విషయమై సీఎం రేవంత్రెడ్డిని కలిసి వివరిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు ఉపేందర్, రవిశంకర్గౌడ్, బాలకృష్ణ, శ్రీనివాస్, రాంబాబు తదితరులు ఉన్నారు.