ఖలీల్వాడి/ కామారెడ్డి, జూన్ 28: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 81.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో దుర్గా ప్రసాద్ తెలిపారు. మొత్తం 1,490 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 1207 మంది పాసైనట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 845 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా..687 మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో రాజు తెలిపారు. మొత్తం 81.30 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు పేర్కొన్నారు. రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరే విద్యార్థులు జూలై 8వరకు ఫీజు చెల్లించాలని సూచించారు. రీవెరిఫికేషన్కు రూ. వెయ్యి, రీ కౌంటింగ్ రూ. 500 ఉంటుందని వారు తెలిపారు. ఇతర వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.