వినాయక్నగర్/ఖలీల్వాడి, జూన్ 26: ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల బంద్కు పిలుపునివ్వగా.. తెరిచి ఉన్న ప్రభుత్వ పాఠశాలను బంద్ చేసేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో ఉన్న శంకర్భవన్ ప్రభుత్వ పాఠశాలను బంద్ చేయించేందుకు ఏబీవీపీ నాయకులు వచ్చారు. విషయం తెలుసుకున్న రెండోటౌన్ పోలీసులు పాఠశాలను బంద్ చేసేందుకు వచ్చిన ఎనిమిది మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా విద్యాసంస్థలను బలవంతంగా బంద్ చేయించేందుకు ప్రయత్నించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెండురోజుల క్రితం సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ హెచ్చరించిన విషయం తెలిసిందే.