ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కేసీఆర్తో భేటీ అయినవారిలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి, హన్మంత్ షిండే, జాజాల సురేందర్ ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పురాతన నాగారం గుట్ట శివాలయంలో శుక్రవారం భక్తులకు ఓ నాగుపాము దర్శనమివ్వడంతో తన్మయత్వం చెందారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు మూడుగంటలపాటు ఆలయంలోని శివలింగంపై పడగ విప్పి ఉన్నట్లు ఆలయ పూజారి శ్రీనివాస్ తెలిపారు.