బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను రెంజల్, ఎడపల్లి మండలాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు గురువారం కలిశారు. ఎర్రవెల్లి ఫాంహౌస్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి జాన్కంపేట లక్ష్మీనృసింహస్వామి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యమకాలం నాటి విషయాలపై కేసీఆర్తో ముచ్చటించారు. కేసీఆర్ను కలిసిన వారిలో డాక్టర్ తెలంగాణ శంకర్, కాశం సాయిలు, తిరుపతి రాము, పాశం భాస్కర్, శేఖర్రాజు ఉన్నారు.
-రెంజల్/ఎడపల్లి, జూన్ 20