డిచ్పల్లి, జూలై 3 : రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని ముల్లంగిలో రూ. 12 లక్షలతో నిర్మించిన గోదామును ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. సుద్దపల్లిలో గిడ్డంగి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. రైతులకు త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గానికి ఐదేండ్లలో 10 వేల ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేయిస్తానన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోధనా సిబ్బంది ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు. ఇతర రాష్ర్టాల్లో కస్తూర్బా ఉపాధ్యాయులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించారని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. అనంతరం డిచ్పల్లి ఆదర్శ పాఠశాలలో మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నగేశరెడ్డి, ఎంపీపీ నర్సయ్య, మోపాల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.